Mahesh: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వచ్చి చాలానే గ్యాప్ కనిపిస్తోంది. మహేశ్ ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం అయితే ఈ పాటికే మరో సినిమా వచ్చి రికార్డ్స్ గురించి మాట్లాడుకునేవారు. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ కా బాప్ తర్వాత గీత గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని మొదలు పెట్టారు. ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత దాదాపు 7 నుంచి 8 నెలలు ఆలస్యంగా సెట్స్ మీదకు వచ్చింది. అప్పటికే టైటిల్ పోస్టర్తో పాటు మహేశ్ లుక్ భారీ అంచనాలు పెంచాయి.
కీర్తి సురేశ్ హీరోయిన్, థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యం అనగానే అందరూ ఓ హాలీవుడ్ సినిమాను ఊహించకున్నారు. ఇక టీజర్ రిలీజైనప్పటి నుంచి ఆ టాక్, అంచనాలు మరో రేంజ్లో పెరిగిపోయాయి. కరోనా వల్ల డిలే అయినా సర్కారు వారి పాట ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మహేశ్ బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు సంక్రాంతి రేస్లో అందరికంటే ముందు అఫీషియల్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సర్కారు వారి పాట సినిమానే.
Mahesh: ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల మహేశ్ బాబు కాంప్రమైజ్..!
అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల మహేశ్ బాబు కాంప్రమైజ్ తన సర్కారు వారి పాట చిత్రాన్ని ఏప్రిల్ 1కి పోస్ట్ పోన్ చేశారు. కానీ, కరోనా థర్డ్ వేవ్ కారణంగా మళ్ళీ ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ చేశారు. మార్చ్ లేదా ఏప్రిల్ నెలకు మళ్ళీ రీ షెడ్యూల్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట మరోసారి రీ షెడ్యూల్ చేయాల్సి వస్తుందని కొత్తగా టాక్ మొదలైంది. అదే జరిగితే మహేశ్ అభిమానులకు పెద్ద డిసప్పాయింట్ అని చెప్పక తప్పదు. ఒకవేళ ఇదే నిజమైతే గనక మళ్ళీ సర్కారు వారి పాట రిలీజ్ దసరాకే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.