Radhey Shyam: “సాహో” లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా “రాదేశ్యాం”. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాల నుండి జరుగుతుంది. జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఇటలీ లో చిత్రీకరణ జరుపుకుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ లుక్లో కనిపిస్తున్నారు. పూర్వజన్మలో ప్రేమకథ నేపథ్యంలో సినిమా ఉంటుందని వార్తలు వినబడుతున్నాయి.
ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సాహో సినిమా ఫ్లాప్ కావడంతో రాధేశ్యాం సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పైగా డైరెక్టర్ కూడా పెద్దగా హిట్ కొట్టిన సినిమాలు కూడా చెప్పుకోలేని తరుణంలో… ఫాన్స్ సినిమాకి సంబంధించి ప్రారంభంలో పెద్దగా అంచనాలు పెట్టుకోలేని పరిస్థితి. అయితే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన స్టిల్స్ మరియు పోస్టర్స్ ను చిన్నపాటి వీడియోలు చూసి ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఆ సినిమాపై అంచనాలు పెంచే చేసుకోవడం జరిగింది. అప్పట్లో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల తరహాలో ప్రభాస్ “రాధేశ్యాం” సినిమా ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సత్యరాజ్ నటిస్తూ ఉండటంతో కచ్చితంగా “రాదేశ్యాం” ప్రభాస్ కెరీర్లో మరో హిట్ సినిమా అని ఆడియన్స్ అంచనా వేయడం జరిగింది.
విషయంలోకి వెళితే ప్రభాస్ నటించిన మిర్చి, బాహుబలి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పేపర్ సరైన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలలో సత్య రాజ్ కీలక క్యారెక్టర్ చేయటం తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే మాదిరిగా రాదే శ్యాం సినిమాలు సత్య రాజ్ కీలక క్యారెక్టర్ చేస్తున్నట్లు తాజా వార్త ఒకటి రావడంతో పాటు ఆయనపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించినట్లు సినిమా యూనిట్ తెలపటంతో… కచ్చితంగా “రాదేశ్యాం” సినిమా సెంటిమెంట్ పరంగా ప్రభాస్ హిట్ అవుతుందని సత్యరాజ్ బట్టి డార్లింగ్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పై ఇంట్రడక్షన్ సీన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలో సినిమాలో సత్యరాజ్ పూజారి క్యారెక్టర్లో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!