INDIA Alliance: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ను సాగనంపాలన్న లక్ష్యంతో ఏర్పడిన విపక్షాల ఇండియా కూటమికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు కూటమి విచ్చిన్నానికి దోహదం అవుతున్నట్లుగా కనబడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ లో ఆప్ నేత, సీఎం భగవంత్ సింగ్ మాన్ లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ షాక్ ల నుండి ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ కోలుకోకముందే మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వినబడుతున్నాయి. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ లోక్ సభ ఎన్నికల ముందు యూ టర్న్ తీసుకొని బీజేపీతో జత కట్టనున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీహార్ మాజీ సీఎం కర్పూరి థాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రధానం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నితీష్ కుమార్ ధన్యవాదులు తెలిపిన మరుసటి రోజే ఈ వార్తలు తెరిపైకి వచ్చాయి. నితీష్ కుమార్ కూడా బైబై చెబితే ఇండియా కూటమికి బిగ్ షాకింగ్ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కూటమిని మార్చడం నితీష్ కుమార్ కు కొత్తేమి కాదు. ఈ సారి కూటమి మారితే అయిదవ సారి అవ్వనుంది. 2013లో ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటముల మధ్య ఆయన ఊగిసలాట ఆడారు. అయితే సీఎం పదవిని ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనాలని ఆ పార్టీ పంపిన ఆహ్వానానికి కూడా నితీష్ కుమార్ స్పందించలేదని వార్తలు వినబడుతున్నాయి. ఇండియా కూటమి ఎన్నికల సన్నాహాల్లో స్పష్టత లేకపోవడం, ప్రధాని అభ్యర్ధిగా ఆమోదం లేకపోవడంతో నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు చర్చల్లో జాప్యం కూడా ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.
YS Sharmila: జగనన్నను చెల్లి షర్మిలమ్మ అంత మాట అనేసిందే..!