బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం చాలా రసవత్తరంగా మారింది. అఖిల్ ని బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేట్ చేయడం తో పాటు అఖిల్ ని ఓ సీక్రెట్ రూమ్ లో కూర్చోబెట్టి ఇంటి సభ్యుల ఆటతీరును గమనించేలా ఫుల్ పవర్స్ చేతికి అవటంతో ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ గా మారింది.
ముఖ్యంగా ఇంటిలో ఉన్న సభ్యులకు కుటుంబ సభ్యుల నుండి లెటర్లు రావడంతో… అల్లర్ల విషయంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులు చెప్పే తీరు బట్టి కారణం బట్టి లెటర్ వస్తుందని తెలపటంతో ఎవరికి వాళ్ళు తమ కన్నీటి గాథలు చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే లాస్య కుటుంబ కథ చెబుతూ కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇక ముక్కు అవినాష్ కూడా తన కెరీర్ గురించి ఓ విషయాన్ని తెలిపారు. ఇక హారిక అయితే తన ఇంటి సభ్యులకు తన గతంలో చేసిన తప్పు గురించి తెలపడం జరిగింది.
అదేవిధంగా మోనాల్, సోహెల్, మెహబూబ్ వంటి వారు కూడా తమ విషయాలను చెప్పుకున్నారు. ఈ క్రమంలో అందరి వివరణ విన్న అఖిల్ చాలామందికి లెటర్లు పంపగా… అభిజిత్, అరియన, అవినాష్ కి ఇంటి నుండి వచ్చిన లెటర్లు ఇచ్చినట్లు కనబడటం లేదు ప్రోమోలో. అదేవిధంగా కొన్ని లెటర్లను మిషన్ లో పెట్టి కట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా హౌస్ లో గ్రూపులు తరహాలో వ్యవహరించిన వారికి అఖిల సీక్రెట్ రూమ్ లో ఉంటూ గట్టిగానే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క అఖిల్ ఇంటిలో లేకపోవటంతో మోనాల్, సోహెల్ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు బాధ పడుతున్నట్లు ఇంటిలో వాతావరణం నెలకొంది. అదేవిధంగా హారిక ఇంటిలో అఖిల్ వెళ్లి పోయేసరికి సందడి పోయిందని అభిజిత్ వద్ద డైలాగ్ వేయగా… నాకు ఎప్పటి లాగే ఉంది అంటూ కౌంటర్ వేయటం తో అభిజిత్ ఫుల్ క్లారిటీ తో ఉన్నట్లు తెలుస్తోంది.