ఇటీవలే కొండ పోచమ్మ సాగర్ కాల్వకు గండి పడడంతో వెంకటాపూర్ గ్రామంలోకి నీళ్లు వరదలా వెల్లువెత్తిన విషయం తెల్సిందే. అయితే దీనిపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది.
ఇది ప్రాజెక్ట్ నాణ్యతను తెలియజేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. చిన్న కాలువ తెగితే ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయని, కాంగ్రెస్ హయాంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోయాయని హరీష్ రావు గుర్తుచేశారు.
కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా హరీష్ రావు విమర్శించారు.