వైసీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు కన్నా ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ పెద్ద శత్రువులా కనిపిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఏపీలో రాజకీయ వ్యవస్థ ను భ్రష్టు పట్టిస్తున్నారని వైసిపి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అవకాశం చిక్కింది తడవుగా వేమూరి రాధాకృష్ణ ను ఏకిపారేశారు. బ్రోకరిజానికి నిలువెత్తు నిదర్శనంగా చంద్రబాబు,రాధాకృష్ణల పేర్లని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు, మీడియా రంగంలో వేమూరి బ్రోకరిజం చేస్తారని ఆయన త్వరగా ఆరోపించారు. ఆంధ్రజ్యోతిది బ్రోకరిజమని, ఆ పత్రిక యజమాని ఓ బ్రోకర్ అని జోగి రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్కే మీద జోగి రమేష్ ఫైర్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు తాబేదారుగా వ్యవహరిస్తున్న ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ ఓ బ్రోకర్ అని ఆయన విరుచుకుపడ్డారు . ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులైన కలెక్టర్లను కించపరుస్తూ వారి మనోభావాలు దెబ్బ తీసేలా కుట్రతో రాధాకృష్ణ చౌదరి తప్పుడు రాతలు రాశారని చెప్పారు.జగన్ ప్రభుత్వాన్ని, జగన్ను గానీ ఏమీ చేయలేక కలెక్టర్లను టార్గెట్ చేసి ఆంధ్రజ్యోతిలో హనీ ట్రాప్ అంటూ దిగజారుడు రాతలు రాశారనారు. గతంలో మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎలా ట్రాప్ చేశారో , వారిని రాధాకృష్ణ గెస్ట్హౌస్లకు పిలిపించి ఏ విధంగా లోబరుచుకున్నారో అందరికీ తెలుసునని ఆయన కౌంటర్ విసిరారు.
హనీ ట్రాప్లో రాధాకృష్ణ సిద్ధహస్తుడన్నారు జగన్ పాలనలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేందుకు తన పత్రికను, మీడియాను రాధాకృష్ణ ఉపయోగిస్తున్నారన్నారు.రాజకీయాల్లో బ్రోకర్ వ్యవస్థకు ఆద్యుడు ఎవరంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబేనని ఈ విషయాన్ని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్వయంగా చెప్పారని. అలాంటి బాబుకు రాధాకృష్ణ చౌదరి కూడా బ్రోకరిజం చేస్తున్నాడని రమేష్ దుయ్యబట్టారు.జోగి రమేష్ విమర్శల మాటెలా ఉన్నప్పటికీ ఆంధ్రజ్యోతి నిస్పాక్షికంగా వ్యవహరించక పోవడం వల్లే రాధాకష్ణ ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని మీడియా ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.