Pushpa: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సుకుమార్ డైరెక్షన్ లో పని నటించిన ఆర్య, ఆర్య2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో వస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇటీవల లీకులు బెడద తగిలిన సంగతి తెలిసిందే. “ధక్కో థక్కో మేక” అనే సాంగ్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ముందుగానే ప్రకటించడం తెలిసిందే. అయితే అనుకున్న టైం కంటే ముందుగానే సోషల్ మీడియాలో ఈ సాంగ్ వచ్చేయడం పుష్ప సినిమా యూనిట్ కి షాక్ ఇచ్చినట్లయింది. ఈ పరిణామంతో బన్నీ తీవ్రంగా ఆవేదన చెందినట్టు ఆగ్రహించినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. అంతే కాకుండా సినిమా నిర్మాతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు టాక్ వస్తోంది. సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో గాని ఎడిటింగ్ రూమ్ లో గాని..ఎవరు కూడా ఫోన్ ఉపయోగించ కూడదు అని కీలక ఆదేశాలు ఇచ్చినట్లు.. హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో పుష్ప ఆడియో సాంగ్ రిలీజ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అధినేతలు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం జరిగిందట. కచ్చితంగా కఠినంగా వారిని శిక్షించే రీతిలో నిర్మాతలు పోలీసులకు తెలియజేసినట్లు ఇండస్ట్రీలో టాక్. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలలో అదే రీతిలో ఎడిటింగ్ రూమ్లలో కూడా సిబ్బంది ఎవరు ఫోన్ ఉపయోగించరాదు అనేక కఠినమైన ఆదేశాలు.. తాజాగా సినిమా యూనిట్ జారీ చేయడం జరిగిందట. ఈ సినిమాని క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!