Megastar : మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నుంచి ఒక సినిమా చేయబోతున్న సంగతి అదే మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ లూసీఫర్. ఈ సినిమాను చరణ్ ఎంతో ఇష్టపడి తండ్రి కోసమే రైట్స్ కొనుగోలు చేశాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మెగాస్టార్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు దీనికి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తాడని అన్నారు. మూడు నెలలు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ కూడా చేశాడు సుజీత్. సాహో తర్వాత ఏకంగా మెగాస్టార్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కడంతో అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. కానీ సుజీత్ చెప్పిన నరేషన్ చిరుని తృప్తిపరచలేకపోయింది.
దాంతో ఆయనకి ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలతో భారీ హిట్స్ ఇచ్చిన వి.వి.వినాయక్ ని ఎంచుకున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్ మూడు వర్షన్ స్క్రిప్ట్ రెడీ చేసి చిరంజీవికి చెప్పినా ఆయనకి నచ్చలేదు. దాంతో చిరంజీవిని ఒప్పించడం వినాయక్ వల్ల కాక ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడు. ఇక ఈ ప్రాజెక్ట్ ఉండదని వార్తలు వస్తున్న సమయంలో షాకిస్తూ మోహన్ రాజా చేతికి లూసీఫర్ రీమేక్ అప్పచెప్పారు చిరు – చరణ్. ఆయన స్క్రిప్ట్ లో చేసిన మార్పులు, చేర్పులు బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ కి ఓపెనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
Megastar : తాజాగా ఒక ఫొటో పోస్ట్ చేసి అధికారకంగా వెల్లడించారు.
తర్వాత కరోనా కారణంగా డిలే అయింది. ఇప్పుడు ఆచార్య సినిమా పూర్తి చేసిన మెగాస్టార్ నెక్స్ట్ మోహన్ రాజాతో సెట్స్ మీదకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దర్శకుడు మోహన్ రాజా – సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మంచి మాస్ బీట్స్ ఉండే ట్యూన్స్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైన విషయాన్ని వీరు తాజాగా ఒక ఫొటో పోస్ట్ చేసి అధికారకంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మెగా సంబరాలకి సిద్దం కావడమే తరువాయి.