Rajamouli : రాజమౌళి ..ప్రస్తుతం పాన్ ఇండియన్ డైరెక్టర్గా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడెంట్ నంబర్ 1 తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజమౌళి ఒక్కో సినిమాకు తన సత్తా చాటుతూ ఎదిగాడు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. హాలీవుడ్ సినిమాలకి మనం ఏమాత్రం తక్కువ కాదని బాహుబలి బిగినింగ్, కన్క్లూజన్ తో చూపించాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళికి గొప్ప దర్శకుడిగా పేరు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా గౌరవమూ లభించింది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ కి పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ తెచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఎన్.టి.ఆర్, చరణ్లకు అదే క్రేజ్ తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే వీరిద్దరికి పాన్ ఇండియన్ స్టార్స్ అని అభిమానులు చెప్ప్పుకుంటున్నారు. సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు సృష్ఠిస్తుందో ఊహకే అందడం లేదు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు.
Rajamouli : రాజమౌళి ని మించి పాన్ ఇండియన్ స్థాయిలో డైరెక్టర్స్గా క్రేజ్ సాధించగలరా..?
అయితే ఇప్పుడు కొరటాల శివ, సుకుమార్, క్రిష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకులందరూ రాజమౌళికి పోటీగా నిలబడాలని ట్రై చేస్తున్నారు. వీరంతా పాన్ ఇండియన్ సినిమాలను రూపొందించే పనిలో ఉన్నారు. అయితే రాజమౌళి ని మించి పాన్ ఇండియన్ స్థాయిలో డైరెక్టర్స్గా క్రేజ్ సాధించగలరా అనేదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. ఈ చర్చలు కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు హిందీ, తమిళ, మలయాళ కన్నడ ఇండస్ట్రీలలోనూ సాగుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!