Lasya Nandita: ప్రస్తుత కాలంలో మారుతున్న జనరేషన్ బట్టి అనేక సమస్యలు ఏర్పడుతూ మృతి చెందుతున్నారు. వీటిలో ఒకటి ప్రమాదాలు. మన దేశవ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటూ పలువురు మృతి చెందుతున్నారు.
ఇక తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే కన్నుమూసింది. ఇక కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు ఏర్పడ్డాయి. అతనిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎంపిక అయింది. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తల్లి మరియు ఎమ్మెల్యే సాయన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ ఆమె కారు ప్రమాదానికి గురై మృతి చెందింది. ప్రస్తుతం ఈమె మరణ వార్త విన్న ఈమె అభిమానులు కృంగిపోతున్నారు.