“KGF chapter 2” : కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో ఏకంగా కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్లకు పాన్ ఇండియన్ స్టార్స్గా క్రేజ్ వచ్చేసింది. చెప్పాలంటే ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కనీసం ఓ పదేళ్ళపాటు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్లో సీక్వెల్గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని మొదలుపెట్టారు. షూటింగ్ కూడా అయిపోయింది. పోస్ట్ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, రిలీజ్ కావడమే లేట్ అని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ పోస్టర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
కరోనా కారణంగా లేటవుతూ వచ్చిన ఈ సినిమా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 కొన్ని కీలక సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ రీషూట్ బెంగుళూరులో జరగబోతుందని అంటున్నారు. ఇవన్నీ నిజమైన కూడా తాజాగా చిత్రబృందం మాత్రం అదిరిపోయే రెండు క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. ఒకటి ఈ సినిమాలో అధీర పాత్రకు సంబంధించినది. మరొకటి గతకొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్కు సంబంధించి.
“KGF chapter 2” : ప్రపంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తను పోషిస్తున్న అధీరా పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి ఉన్న పిక్ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ వెల్లడించారు. ఇక కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్లో ప్రపంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ అప్డేట్ కూడా మేకర్స్ తాజాగా వెల్లడించారు. యష్ సరసన యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపబోతున్నారని గతకొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!