Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రెండు సినిమాల విషయంలో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారట. అందుకు కారణం రీ షూట్ అంటూ వార్తలు వస్తుండటమే. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా రాధే శ్యామ్ రూపొందుతోంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 2022, జనవరి 14న భారీ స్థాయిలో 7 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. హిందీ వెర్షన్కు సంగీత దర్శకుడిగా మనన్ భరద్వాజ్, తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టి మెల్లగా సౌత్ భాషలతో పాటు హిందీలోనూ ఒక్కో సాంగ్ను రిలీజ్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమాలతో పోటీపడుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మూడు నాలుగు రోజుల రీషూట్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. నెలరోజులు మాత్రమే ఉన్న రాధే శ్యామ్ ఇప్పుడు రిలీజ్ అనే టాక్ షాకిస్తోంది.
Prabhas: ఇలా రీషూట్ చేసిన చాలా సినిమాలు అయితే బ్లాక్ బస్టర్.. లేదంటే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఈ సినిమా మాత్రమే కాదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ – శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా దాదాపు 60 శాతానికి పైగానే షూటింగ్ పూర్తైందట. సినిమాకు ఎంతో కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్ ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి చేశాడట. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సీక్వెన్స్ మొత్తం రీషూట్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ చెప్పిన సలహాలు విన్న నిర్మాతలు సలార్ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం మళ్ళీ రీషూట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇలా రీషూట్ చేసిన చాలా సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ అయ్యాయి. లేదంటే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారట.