Rajiv Kumar: దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు వీఐపీ భద్రత కల్పించారు. దీంతో సాయూధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా ఏజన్సీలు ఇటీవల సిఫార్సు చేశాయి. దీనిని పరిశీలించిన హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జెడ్ కేటగిరి కింద సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది రాజీవ్ కుమార్కు రక్షణ విధుల్లో పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.
1984 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ కుమార్ ..2020 లో ఎన్నికల కమిషనర్ గా నియమితులైయ్యారు. 2022 మే 15న 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం 18వ లోక్ సభ ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైయ్యారు.
Congress: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి