Congress: ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్ విడుదలైంది. రీసెంట్ గా అయిదు లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ .. తాజాగా ఆరు లోక్ సభ, 12 అసెంబ్లీ సభ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 11 లోక్ సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.
కాగా, ఇటీవలే వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పూతలపట్టు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిలకు ఈ జాబితాలో చోటు దక్కింది.
లోక్ సభ అభ్యర్ధులు
- విశాఖపట్నం – పులుసు సత్యనారాయణ రెడ్డి
- అనకాపల్లి – వేగి వెంకటేశ్
- ఏలూరు – లావణ్య కావూరి
- నరసరావుపేట – గార్నెపూడి అలగ్జాండర్ సుధాకర్
- నెల్లూరు – కొప్పుల రాజు
- తిరుపతి (ఎస్సీ) – డాక్టర్ చింతా మోహన్
అసెంబ్లీ అభ్యర్ధులు
- టెక్కలి – కిల్లి కృపారాణి
- భీమిలి – అడ్డాల వెంకట వర్మరాజు
- విశాఖ సౌత్ – వాసుపల్లి సంతోష్
- గాజువాక – లక్కరాజు రామరాజు
- అరకు వ్యాలీ (ఎస్టీ) శెట్టి గంగాధర స్వామి
- నర్సీపట్నం – రౌతుల శ్రీరామమూర్తి
- గోపాలపురం (ఎస్సీ) – మార్టిన్ లూథర్
- ఎర్రగొండపాలెం (ఎస్సీ) – డాక్టర్ బూధల అజితరావు
- పర్చూరు – నల్లగొర్ల శివ శ్రీలక్ష్మీ జ్యోతి
- సంతనూతలపాడు (ఎస్సీ) – విజేష్ రాజు పాలపర్తి
- గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డి రమేష్ బాబు
- పూతలపట్టు (ఎస్సీ) – ఎంఎస్ బాబు
Rajiv Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ భద్రత