AP PRC: కొన్ని నెలలుగా చర్చల్లో ఉన్న పీఆర్సీని ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 23.29 శాతం పీఆర్సీని ప్రకటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని పరిశీలిస్తే.. ‘కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబాల వారికి జూన్ 30 లోగా కారుణ్య నియామకాలు చేపడతాం. EHS సమస్యలపై 2 వారాల్లోపు మెరుగైన పరిష్కారం అందిస్తాం. MIG కాలనీల్లో 10% ఇల్లు కేటాయిస్తాం.. 20% రిబెట్ ఇస్తాం. జూన్ 30 లోగా సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పూర్తి చేస్తాం. జులై నుండి నూతన స్కేల్స్ ఇస్తాం. PF, APGLI పెండింగ్ బకాయిలు ఏప్రిల్ లోపు పూర్తి చేస్తాం. పెండింగ్ డీఏలను జనవరి జీతం నుండే అమలు చేస్తాం. జనవరి 2022 నుండి నూతన PRC అమలు చేస్తాం. 2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఇకపై PRC ప్రక్రియ పదేళ్లకోసారి అమలు. (AP PRC) పీఆర్సీ అమలుతో రాష్ట్రంపై 10,247 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. CPS మీద జూన్ 30 లోగా మంచి నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. అయితే..
పదవీ విరమణ వయసు పెంపు..
ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కి పెంచిన ప్రభుత్వం.. నిరుద్యోగులకు చేదు వార్త చెప్పిందనే చెప్పాలి. ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూసే వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచితే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 60 నుంచి 62కి పెంచింది. ఈసారి ఈ పరిమితిని 65కి పెంచితే నిరుద్యోగుల సమస్య మరింత జటిలమవుతుందనే చెప్పాలి. (AP PRC) ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు.. హెచ్ఆర్ఏ తగ్గింపు, ఎరియర్స్ ఇచ్చే అవసరం ఉండదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వాళ్లకేం సమాధానం చెప్తారో..
సీఎం వరాలతో ఉద్యోగ సంఘాలు కొంత తగ్గినా ఊహించనివి దక్కాయని సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ నిర్ణయంతో నిరుద్యోగం పెరుగుతుందనేది వాస్తవం. ఉన్నవారికి పదోన్నతులు రావు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. (AP PRC) ఉద్యోగులను సంతృప్తి పరచినా.. నిరుద్యోగులు అసంతృప్తికి గురైతే మాత్రం ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాల్సిందే.