YS Jagan: ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసహ్య రాజకీయాలు చేస్తొందని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యాసదస్సుకు సీఎం జగన్ హజరైయ్యారు. గతంలో మా బాబాయ్ ని నాపై పోటీకి నిలబెట్టారు.. ఇప్పడు మా సోదరిని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తొందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్దికోసమే రాష్ట్రాన్ని విడదీసిందన్నారు. విభజించి పాలించడమే ఆ పార్టీ నిత్య విధానమని విమర్శించారు. కాంగ్రెస్ గతం నుండి పాఠాలు నేర్చకోలేదని అన్నారు.
కుటుంబాల్లో విభేదాలు సృష్టించి రాజకీయం చేస్తొన్న కాంగ్రెస్ పార్టీకి మరో సారి దేవుడు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని అన్నారు. టీడీపీ – జనసేనతోనే ఎన్నికల్లో తమ పోటీ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని వివరణ ఇచ్చారు. ఇష్యూ బేస్డ్ విషయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
సర్వేల ఆధారంగానే వైసీపీ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేకత ఉన్నందున వల్లనే కొందరికి టికెట్లు ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి నుండి దిగిపోయినా బాధపడననీ, వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చామని అన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీయే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు జగన్.
చంద్రబాబు అరెస్టుపై
టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే పోలీసులు ఆయనను అరెస్టు చేశారని జగన్ తెలిపారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారని, అందుకే చంద్రబాబు జైల్ లో 52 రోజులు ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత అరెస్టు చేయాలని ఎవరు అనుకోరని ..చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు.