ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు అలీ కొద్దిసేపటి క్రితం కలిశారు. అలీ గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విషయం తెల్సిందే. తనకు అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అయినా కూడా జగన్ పార్టీకే అలీ ఓటు వేశారు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా పొరపచ్చాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అలీను విమర్శించడం, దానికి అలీ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం ముదిరింది. 2019 ఎన్నికలలో వైసీపీకి సపోర్ట్ చేసారు అలీ. మరి ఈ నేపథ్యంలో అలీ జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి కల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలుస్తోంది. మరి పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి.