టిడిపి ఎమ్మెల్యే బాలయ్య బాబు హిందూపురం నియోజకవర్గంలో చేపడుతున్న పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే చంద్రబాబు పై బాలయ్య అసహనం గా ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి చూస్తే ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా బాలయ్య మారినట్లు టిడిపి పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.
మొన్నటి వరకు పార్ట్ టైమ్ పొలిటీషియన్ అన్నట్టు గా వ్యవహరించిన బాలయ్యబాబు.. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మాట్లాడే పరిస్థితి ఉండేది. కానీ తాజాగా మాత్రం బాలయ్యబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతా వైసిపి పార్టీ వాళ్లనే టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో డైలాగులు వేయటం పార్టీలో మాత్రమేకాక రాష్ట్రవ్యాప్తంగా బాలయ్య తీరు ఆసక్తికరంగా మారింది.
అంతేకాకుండా వైసీపీ మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేస్తూ బాలయ్య వార్నింగ్ ఇవ్వటం పెద్ద సంచలనం అయ్యింది. ఒకానొక సమయంలో తన నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు అదే విధంగా అభివృద్ధి పనులు చూసుకుని వెళ్ళిపోయే విధంగా బాలయ్య వ్యవహారశైలి ఉండేది. కానీ ఈ దఫా ఇటీవల పర్యటనలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై బాలయ్య మాట్లాడటం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో రైతు సమస్యల దగ్గరనుండి ఆలయాలపై దాడులు వరకు అన్నింటిపైనా స్పందిస్తున్నారు బాలయ్య బాబు. తన తాజా పర్యటనలో అధికార పార్టీ వైసీపీని ఏకిపారేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే బాలయ్యబాబు రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అవుతూ.. 25 మందిలో ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండకుండా.. , పార్టీలో పెద్ద పదవిని ఆశించే రీతిలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నట్లు కొంతమంది టిడిపి పార్టీలో అంతర్గతంగా బాలయ్య వ్యవహారశైలిపై గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా బాలయ్య బాబు ఈ సారి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన టు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.