(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మొన్న ఇండోర్లో బిజెపి ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ. నిన్న గోవాలో కాంగ్రెస్ శాసనసభ్యుడు నితేష్ నారాయణ రానే. అధికారులపై దాడికి తెగబడుతున్న ప్రజాప్రతినిధులకు అంతు ఉండడం లేదు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారిని ఆకాశ్ విజయవర్గీయ క్రికెట్ బ్యాట్తో కొట్టిన సంగతి మరచిపోకముందే గోవాలో అలాంటిదే మరో ఘటన జరిగింది.
గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ ఇంజనీర్పై బకెట్లతో బురద పోశారు. కంకావతి వద్ద ముంబై – గోవా రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే నితేష్ నారాయణ రానే ఆయన అనుచరులు ఇంజనీర్ ప్రకాశ్ షెడేకర్పై బకెట్లతో బురద పోసి బ్రిడ్జికి కట్టేశారు. జాతీయ రహదారిపై గతుకులు ఉండటంపై వారు తమ ఆగ్రహాన్ని ఇంజనీర్పై చూపించారు.
ఇండోర్లో జరిగిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదియే స్వయంగా స్పందించారు. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కూడా మోది హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం తెలంగాణలోని సిర్పూర్ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కృష్ణారావు తన అనుచరులతో అటవీశాఖ అధికారిణిపై కర్రతో దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటనను కేంద్ర అటవీ శాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా తీవ్రంగా ఖండించారు.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి..