వారణాశి(ఉత్తర్ప్రదేశ్),జనవరి 24: రోజు రోజుకు ప్రియాంక రాక పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీపై ప్రియాంక పోటీ చేయాలని కోరుతూ వారణాశిలో పోస్టర్లు వెలిశాయి.
ఉత్తర్ప్రదేశ్లోని వారణాశి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రియాంక గాంధీ రాకను స్వాగతించారు. మోదీపై పోటీ చేయాలంటూ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లలో ప్రియాంకతో పాటుగా రాహుల్ గాంధీ, మోదీపై 2014ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అజయ్ రాయ్ ఫొటోలను ముద్రించారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రియాంకను పార్టీ లోక్సభ అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతూ బెనారస్లో ర్యాలీ చేపట్టారు.
మోదీపై ప్రియాంక పోటీ చేస్తే ఆ ప్రభావం మిగిలిన రాష్ట్రాలపైన కూడా ఉంటుందని రాయ్ వ్యాఖ్యానించారు.