ఈ నేపథ్యంలో తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై తాజా సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ఆ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ (143%) తొలి స్థానంలో ఉండగా తెలంగాణ(122%) రెండో స్థానంలో ఉంది. ఇక, మరో తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఆ జాబితాలో చివరి స్థానాల్లో ఒకటి దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ కు ఈ ముప్పు కేవలం 8 శాతం ఉండడం ఊరటనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యలు బాగున్నాయని, ఏపీలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నారని జాతీయ స్థాయి వైద్య, ఆరోగ్య నిపుణులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
అంతకుముందే, తెలంగాణలో రోజువారి కరోనా టెస్టుల సంఖ్య ఎంతో వెల్లడించాలని….కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని..డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా టెస్టుల సంఖ్య 4వేలకు పెరిగినా….ఆ సంఖ్య మరింత పెరగాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెస్టుల సంఖ్య పెంచకుంటే…కేసుల సంఖ్యలో ఢిల్లీ, మహారాష్ట్రలను తెలంగాణ అధిగమిస్తుందని హెచ్చరిస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు శాతం
ఢిల్లీ (143%)
తెలంగాణ(122%)
మహారాష్ట్ర (65%)
గుజరాత్ (45%)
తమిళనాడు (38%)
ఉత్తరప్రదేశ్(18%)
కర్ణాటక (8%)
ఆంధ్రప్రదేశ్( 8%)
కేరళ (0.7%)