Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది.శుక్రవారం నవంబర్ 19వ తేదీన ఈ సీరియల్ 1,201 ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని హైలెట్స్ ఎంటో ఇప్పుడు చూసేద్దాం..
Milk: పాలు తాగడానికి ఓ పద్ధతి ఉందట.. ట్రెండింగ్ అప్డేట్..!!
దీపావళి పండుగ రోజున ఇంట్లో సందడి లేకపోవడంతో సౌందర్య బాధపడుతూ ఉంటుంది. హిమ, సౌర్య నానమ్మ ఎక్కడకైనా బయటకు వెళ్దామా? లాస్ట్ టైం వెళ్లాం కదా అలా అనే సరికి సౌందర్య సరే అంటుంది. గోల్గొండ వెళ్దామని పిల్లలు చెబుతారు. ఈరోజు అమ్మ పుట్టిన రోజుకూడా చాలా బాగుంటుంది అనడంతో అప్పుడే దీప వస్తుంది. సౌందర్య ఈరోజు నీ పుట్టిన రోజు అంట కదా అని అడిగితే గుర్తులేదు మర్చిపోయా అత్తయ్యా అంటుంది దీప.. ఇక పిల్లలు బయటకు వెళ్దామని తల్లితో అనడంతో వద్దని అంటుంది. గోల్గొండ బదులు దాని పక్కన సమాధులు ఉంటాయ్ వాటిని చూద్దాం ఎప్పటికైనా మనం కూడా అక్కడకు చేరాల్సిందే కదా అని సౌందర్యకు సెటైర్ వేస్తుంది దీప..
సౌందర్యను రాక్షసులతో పోల్చిన దీప..
పిల్లలు మనం ఇంతకూ బయటకు వెళ్తున్నామా లేదా అని అడుగగా లేదని అంటుంది దీప.. ఇక దీపావళి పండుగ విశేషాన్ని పిల్లలకు వివరిస్తుంది. పూర్వం మనుషులు, రాక్షసులు వేర్వేరుగా ఉండేవారని, రాక్షసులు మరణించాక మనుషులు సంతోషంగా దీపావళి పండుగ చేసుకునేవారని చెబుతుంది. కానీ ప్రస్తుతం రాక్షసులు మనుషుల రూపంలో ఉన్నారని చెప్పడంతో ఆ మాట సౌందర్యకు తగులుతుంది. దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య.
కుమిలికుమిలి ఏడ్చిన సౌందర్య..
దీప అంటున్న మాటలను గుర్తుచేసుకుని బాధపడుతుంటుంది సౌందర్య. భర్త ఆనందరావు రాగానే.. దీపను చూస్తే భయంగా ఉందండి..తాను ఆత్మహత్య చేసుకుంటుందేమోనండి అంటూ కుమిలికుమిలి ఏడుస్తుంది. చనిపోయే ముందు ఎలా మాట్లాడుతారో సరిగ్గా దీప అలాగే మాట్లాడుతుందని, అవసరానికి మించి సంతోషంగా ఉందని భర్తకు చెప్పుకుని బాధపడుతుంది సౌందర్య. అయితే, మోనితది సహజమైన గర్భం అని దీపకు నిజం చెప్పేసినట్టు కల గంటాడు కార్తీక్..సరిగ్గా అప్పుడే సౌందర్యకు మోనిత ఫోన్ చేసి.. ‘ఆంటీ రేపు మా బాబు బారసాల ఉంది.. తప్పకుండా రావాలని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.