మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. జాక్వెలిన్ బెయిల్ ను న్యాయస్థానం వచ్చే నెల 10వ తేదీ వరకు పొడిగించింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నుండి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రూ. 7 కోట్ల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకున్నారని ఈడీ పేర్కొని ఆమెను విచారణ చేసింది. ఈ కేసులో ఆమె ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు.
గత నెల 26వ ఈ కేసులో ఆమెకు కోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇవేళ తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ తో కలిసి పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 10వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం పేర్కొంది. అప్పటి వరకు తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్టు తెలిపింది. కేసులో నిందితులకు చార్జిషీటు కాపీలను అందజేయాలని ఈడీకి కోర్టు ఆదేశించింది. బెయిల్ పొడిగింపుతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు స్వల్ప ఊరట లభించినట్టయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!