యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌమ్ రూపొందించబోతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను 2021 లో ప్రారంభించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఇదొక్కటే. కాని బాలీవుడ్ మీడియా నుండి టాలీవుడ్ మీడియా వరకు అంతటా ఆ సినిమాకు సంబంధించిన రక రకాల ప్రచారాలు మొదలయ్యింది.
ఈ సినిమాలో ప్రభాస్ ఎలా పాత్ర ఎలా ఉండబోతుంది..అన్నది ఇంకా మేకర్స్ వెల్లడించలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం రాముడి గా ప్రభాస్ కనిపించబోతున్నాడని వార్తలు రాసేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు కొంతమంది వార్తలు సృష్ఠిస్తే కొంతమంది ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకుంటున్నారన్న వార్తలు రాస్తున్నారు.
ఇంతకముందు నాగ్ అశ్విన్ సినిమా కి సంబంధించి హీరోయిన్ విషయంలోను ఇలాంటి ప్రచారమే జరిగింది. ఫైనల్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేను ఎంపిక చేశారు. అలాగే ఈ ఆదిపురుష్ సినిమాకి కూడా బాలీవుడ్ హీరోయిన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తుందట. అంతేకాదు ఈ సినిమాకొసం ప్రియాంక చోప్రా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్ని రూమర్స్ అన్న మరో మాటా వినిపిస్తుంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సంవత్సరం చివరలో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!