ఏపీలో తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రమైన డాక్టర్ సుధాకర్ కనిపించకపోవడంతో పోలీసులు కంగారు పడుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జై భార్యతో కలిసి ఇంటికెళ్లాడు.
అనంతరం ఆయన కనిపించకుండా పోయారు.దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.అసలే సిబిఐ విచారణ సైతం జరుగుతున్న తరుణంలో సుధాకర్ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు పిచ్చిపట్టినట్లుగా ఉంది.ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ సుధాకర్ కరోనా నుండి రక్షణ కోసం ప్రభుత్వ వైద్యులకు ఎటువంటి సామాగ్రి అందజేయడం లేదని ఆరోపించటం ,దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయడం , ఆ తదుపరి విశాఖపట్నంలో సుధాకర్ నడి రోడ్డుపై హల్చల్ చేయగా పోలీసులు ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించటం, ఈ విషయమంతా హైకోర్టుకుదృష్టికి వెళ్లగా సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉదంతం మీద సిబిఐ విచారణకు ఆదేశించడం తెలిసిందే.తదుపరి జరిగిన నాటకీయ పరిణామాల్లో సుధాకర్ ని మానసిక వైద్యశాలకు తరలించారు.చివరకు ఆయన తల్లి పెట్టుకున్న ఎబిఎస్ కార్పస్ రిట్పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాల మేరకు సుధాకర్ను విడుదల చేయడం కూడా తెలిసిందే.అయితే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్లిపోయారు.ఆ తరువాత నుంచి ఆయన కనిపించకుండా పోయారు.దీంతో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు అయితే డాక్టర్ సుధాకర్ మానసిక ప్రశాంతత కోసం అజ్ఞాతంలోకి వెళ్లారని ,ఐదు రోజుల పాటు ఎవరినీ కలవకూడ దని నిర్ణయించుకున్నారని మరో సమాచారం అందింది.ఏదేమైనా డాక్టర్ సుధాకర్ వ్యవహారం ప్రభుత్వాన్ని పోలీసులను కలవర పరుస్తూనే ఉంది