అక్కినేని నట వారసుడిగా అదిరిపోయే బ్యాగ్రౌండ్తో తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇంత వరకు తన సత్తా చాటలేదు.. ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో ఖర్చుకు కూడా వెనకాడకుండా నిర్మించిన మొదటి సినిమాతోనే పెద్ద డిజాస్టర్ను మూటగట్టుకున్న అఖిల్. మొదట్లో మాస్ కథల్నీ ఎంచుకున్న కలిసి రాలేదు.. ఆ తర్వాత వాటిని వదిలి ప్రేమ కథలను ఎంచుకున్నాక అవి కూడా నిరాశనే మిగిల్చాయి. ఇక అప్పటి నుండి సరైనా హిట్ కోసం ఆరాటపడుతూనే ఉన్నాడు ఈ యువ హీరో. ఇక అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్ 2 బ్యానర్ పై బన్ని వాసు, వాసు వర్మ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.. ఇక హీరోయిన్ విషయానికి వస్తే వరుస విజయాలతో టాలీవుడ్లో యమ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దె ను, అఖిల్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేశారు.. ఇక లేటెస్ట్ సమాచారం మేరకు అఖిల్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడిన్స సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు సినిమాలతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడట అఖిల్. ఇక అఖిల్ 5 లో హీరోయిన్గా రష్మిక మందన్నను తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటిదాక ఒక్క హిట్టు కొట్టని అఖిల్ను ఈ సారైనా సక్సెస్ బాటలో నడిపించడానికి చేసే ప్రయత్నంలో నాగార్జున రంగంలోకి దిగి తను కూడా చేయవలసిన ప్రయత్నాలన్ని చేస్తున్నాడట.
ఇకపోతే ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ‘ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుండగా సురేందర్ రెడ్డి సినిమా మాత్రం కమర్షియల్ ఫార్మెట్ లో వస్తుందనే ప్రచారం జరుగుతుంది.. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇంతవరకు ఎలాంటి విషయాన్ని ప్రకటించలేదు. కాగా చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సైరా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదనిపించింది.. ఆ తర్వాత సురేందర్ చేస్తున్న చిత్రం ఇదే.. మరి సురేందర్ రెడ్డి అయినా అఖిల్కు సాలిడ్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!