Entrance Test : దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్సీ (హాస్పిటాలిటీ , హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2021-2022 సంవత్సరానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ :
అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
వయస్సు : 1/7/2021 నాటికి ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 25 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ , పిడబ్ల్యుడి అభ్యర్థులకు 28 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా
పరీక్ష విధానం : ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున కేటాయించారు. తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం మూడు గంటలు.
దరఖాస్తు రుసుం : ఓబిసి, జనరల్ అభ్యర్థులకు రూ.1000 , జనరల్ – ఈడబ్ల్యుఎస్ రూ. 700 , పిడబ్ల్యుడి , ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.450 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 10/5/2021
పరీక్ష తేదీ : 12/ /2021.