Anbu – ariv : ప్రశాంత్ నీల్ ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క ఉగ్రం సినిమా ఆయన సత్తా కన్నడ ఇండస్ట్రీకి తెలిపింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ ప్రపంచం మొత్తానికి తన స్టామినా, డైరెక్షన్ కెపాసిటీ చూపించింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలను హాలీవుడ్ రేంజ్ లో తీస్తాడని ప్రశంసించేలా చేసింది. దాంతో ఆయనకి సౌత్ లో పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో అందరు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో ఉన్నారు. దీనికోసం ముందే డేట్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు.
ఈ కారణంగానే ప్రభాస్ సలార్ సినిమా చేయడానికి అంగీకరించాడు. భారీ యాక్షన్ ఎంటైనర్గా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నాడు. మైత్రీ వారితో ఒక సినిమా ఎన్.టి.ఆర్ హీరోగా చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలవనుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు. తర్వాత రాం చరణ్ – డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా కమిటయ్యాడట. అంతేకాదు మళ్ళీ దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ తో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని అంటున్నారు.
Anbu – ariv : ప్రశాంత్ నీల్ తనతో పాటే తన టీం ని వదల్లేదు.
అయితే ప్రశాంత్ నీల్ తనతో పాటే తన టీం ని వదల్లేదు. ఆయనకి వచ్చినంత క్రేజ్ ఆయన టీమ్ కి వస్తోంది. సలార్ కి దాదాపు కేజీఎఫ్ టీం వర్క్ చేస్తోంది. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో పాటే ఉంటున్నారు. అలాగే స్టంట్ మాస్టర్స్ అంబు, అరివ్ కూడా తన సినిమాలకి పని చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత ఈ మాస్టర్స్ కి బాగా పాపులారిటీ వచ్చింది. తెలుగులో రవితేజ సినిమా, అలాగే ప్రభాస్ సలార్, తమిళంలో సూర్య నటిస్తున్న సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇదే వరుసలో లోకథానాయకుడు కమల్ హాసన్ – లోకేష్ కనగ్ రాజ్ కాంబోలో వస్తున్న సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. అదికారకంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అంతేకాదు మరికొన్ని క్రేజీ సినిమాలకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!