Breaking: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ సర్వర్ డౌన్ అయ్యింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. ఫేస్ బుక్ యూజర్లు వారి అకౌంట్ లు లాగిన్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది. దీంతో ఏమి జరుగుతుందో అర్ధం కాక యూజర్లు అయోమయానికి, అసహనానికి గురైయ్యారు. మంగళవారం రాత్రి నుండి యూజర్లు ఫేస్ బుక్ పోస్టు పెట్టడం సాధ్యం కాలేదు. పోస్టింగ్స్ చూడటం కూడా ఎవరికీ కుదరలేదు.
దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూజర్ల ఫేస్ బుక్ అకౌంట్ లు ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అవుతున్నాయని చాలా మంది పేర్కొన్నారు. ఫేస్ బుక్ అంతరాయ సమస్యపై యూజర్లు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయం నుండి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ను ఉపయోగించడంలో యూజర్లు ఇబ్బందులు పడ్డారు.
దేశ వ్యాప్తంగా 14,857 మంది ఫేస్ బుక్ వినియోగదారులు, 32,518 మంది ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు ఇబ్బందిపడినట్లుగా తెలుస్తొంది. డౌన్ డిటెక్టర్ మ్యాప్ లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ సహా అనేక ఇతర నగరాల్లో ఫేస్ బుక్ సేవల ఇబ్బంది ఉన్నట్లు చూపింది. భారతదేశంలోనే కాక యూనైటెడ్ స్టేట్స్, యూనైటెడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్ తో సహా అనేక దేశాలలో కూడా ఫేస్ బుక్ యూజర్లు యాక్సిస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదులు చేశారు.
ఈ సమస్యపై మెటా ప్రతినిధి అండీ స్టోన్ స్పందించారు. యూజర్ల యాక్సిస్ సమస్య తమ దృష్టికి వచ్చిందని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Gummanur Jayaram: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం .. మంత్రివర్గం నుండి బర్త్రఫ్