Gummanur Jayaram: మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.
ఈ సందర్బంగా జయరాం మాట్లాడుతూ .. టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2009లో తాను టీడీపీ జడ్పీటీసీగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ తప్పిపోయిన పిల్లవాడు 15ఏళ్ల తర్వాత ఇంటికి చేరితే ఎలా ఉంటుందో ఇప్పుడు తన పరిస్థితి అదేనని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీయేనని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు.
మరో పక్క పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరు జయరాంను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు గవర్నర్. తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించకుండానే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరడంతో ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారు. ఇవేళ ఉదయం జయరాం మీడియా సమావేశంలో వైసీపీకి, ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
CM YS Jagan: ఏపీ రాజధానిపై మరో సారి కీలక ప్రకటన చేసిన సీఎం వైఎస్ జగన్