మాటల మాంత్రీకుడి స్టాటజీ ఏంటీ.. ? ఆయన మైండ్ సెట్ ఏంటీ.. ఆయన మసులో ఇప్పుడు ఏముంది ..ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు .. ఎన్.టి.ఆర్ తోనా లేక సూపర్ స్టార్ మహేష్ బాబు తోనా లేక ఎనర్జిటిక్ హీరో రామ్ తోనా.. అసలు వీళ్ళెవరూ కాదు .. బండ్ల గణేష్ నిర్మాణం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నా..? ఇదీ ఇప్పుడు ప్రతీ ఒక్క హీరో అభిమానుల మనససులను తొలచివేస్తున్న ప్రశ్న. దీనికి ఆయా హీరోలు గాని .. లేదా మన మాటల మాంత్రీకుడు గాని సమాధానం ఇవ్వాలి.
లేదంటే ఒక్కో హీరో అభిమానులకి ఉడికిపోతుంది. కారణం గత కొన్ని రోజులుగా త్రివిక్రం ఈ అందరి హీరోలతో సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు రావడమే. వాస్తవంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం సినిమా చేయాల్సి ఉంది. ఇదే ఫిక్స్. ఈ సినిమా ఎన్.టి.ఆర్ మైల్ స్టోన్ మూవీ 30 వ సినిమా కావడం తో భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధిచిన అధికారక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ” అయినను పోయిరావలె హస్తినకు ” అన్న టైటిల్ తో హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా త్రివిక్రం – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రచారం అవుతోంది. అయితే ప్రస్తుతం ఎన్.టి.ఆర్.. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తుండగా ఈ సినిమా నుంచి ఎన్.టి.ఆర్ ఇప్పుడప్పుడే బయటకి వస్తాడన్న గ్యారెంటీ లేదని అంటున్నారు.
అందుకే త్రివిక్రం నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కాదు రామ్ తో కూడా చేసేస్తాడని ప్రచారం.. అలాగే నాగార్జున కూడా కొడుకు అఖిల్ తో సినిమా చేయమని అడుగుతున్నట్టు .. ఇలా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఈ విషయంలో త్రివిక్రం మాత్రం ఏమాత్రం క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు. మరి ఒక్కసారి క్లారిటీ ఇస్తే వీటన్నిటికి చెక్ పెట్టినట్టు అవుతుంది కదా.