Foot Massage: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని మీద బయట ఉంటారు. దానికి తోడు బిగుతుగా ఉండే సాక్సులు, షూస్ లోనే గంటలతరబడి కాళ్లు ఉండటం వలన ,అరికాళ్లకు గాలి తగిలే పరిస్థితి ఉండదు. ఒట్టి పాదాలు నేల మీద నడిచేందుకు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి షూష్ ఎక్కువగావాడేవాళ్లు వారానికి మూడు లేదా నాలుగు సారులు అయినా అయినా కాళ్లకు మసాజ్ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. .
శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ను అడ్డుకోవచ్చు .ప్రెగ్నెంట్ స్త్రీలకు కాళ్ళ వాపులు అనేవి చాలా సహజం. ఎక్కువ దూరం నడవకపోవడం వల్ల కాళ్ల వాపులు వస్తాయి . వాపులు పెరిగే కొద్దీ ఇతర సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు రోజూ పడుకునే ముందు పదిహేను నిమిషాల పాటు అరికాళ్లకు మసాజ్ చేయించుకుంటే మంచిది. యాంగ్జయిటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఇవన్నీ నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసే జబ్బులు. వీటిని తగ్గించుకోవటానికి రిలాక్సేషన్ టెక్నిక్లు అనుసరించాలి. ఈ టెక్నిక్స్లో అద్భుత ఫలితాలని ఇచ్చేది ఈ ఫుట్ మసాజ్. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత కలుగుతుంది.మెనోపాజ్, పిఎంఎస్ సమస్యలు ఉన్నట్లుండి మూడ్ మారిపోవడం, కోపం, తలనొప్పి,చిరాకు, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి సమస్యలు పట్టుకుంటాయి. ఈ సమస్యతో బాధపడేవారు పాదాల మర్దనతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మర్దన రోజూ చేసుకుంటే సమస్యలుచాలా వరకు తగ్గుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆఫీసులో పని ఒత్తిడి,టార్గెట్స్ ఉండటం వల్ల ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవటం, జంక్ఫుడ్ను ఆశ్రయించడం వలన జీర్ణశక్తి తగ్గడం వంటి అనేక రకాల సమస్యల వల్ల హై బీపీ కి దారి తీస్తుంది. రోజుకు కనీసం పది నిమిషాల పాటు ఫుట్ మసాజ్ చేసుకుంటే అధిక రక్తపోటు ద్వారా వచ్చే సమస్యలను అడ్డుకోవచ్చు.