ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకయ్యారు. దీంతో ఏపీ తెలంగాణ సహా ప్రముఖ నేతలంతా ఆయనను అభినందిస్తున్నారు. అదే విధంగా ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ కొత్త బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై స్పందించారు.
కొత్త మార్పును స్వాగతిస్తూ సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని తేల్చిచెప్పారు.బీజేపీకి పార్టీ అధ్యక్షుడు మారినంత మాత్రాన పొత్తు విషయాన్ని పున: సమీక్షించలేమనే విషయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పష్టం చేశారు.సోమూ వీర్రాజుతో కలిసి పనిచేస్తామని.. ముందుకు సాగుతామని.. తమ బంధం విడిపోదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు.నిజానికి బిజెపి పూర్వ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇన్నాళ్లు పవన్ బాటలో నడిచారు.
ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు.. ఒకే ఆలోచనలతో వెళ్లారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు దూకుడైన వ్యక్తి కావడం.పవన్ కల్యాణ అంతకు మించి స్పీడయిన నాయకుడు కావడంతో వారిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.పైగా సోము వీర్రాజు స్వతహాగా చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకించే నాయకుడు.పవన్ కల్యాణ్ కి చంద్రబాబు విషయంలో కొద్దిగా పట్టువిడుపు ధోరణులు ఉంటాయి.వీరిద్దరి మైండ్ సెట్ వేరు వేరు.మరి వీరి కాపురం ఏ విధంగా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశం