కర్ర విరగకూడదు.., పాము చావకూడదు…!! తడవకూడదు.., కానీ వర్షంలో తిరగాలి…! పొదుగు ఉండదు…, కానీ పాలు పిండాలి….!! స్థలం ఉండదు.., కానీ ఇల్లు కట్టెయ్యాలి…!! అవునండీ. ఇవన్నీ నిజాలే. ఇప్పుడు ఏపీలో బీజేపీ చేయాల్సినవి ఇవే. ఒక్క ముక్కలో సూటిగా చెప్పుకోవాలి అంటే “ప్రతిపక్షంగా ఉండాలి.., కానీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించకూడదు..”..! ప్రజా సమస్యలపై గళం విప్పాలి.., కానీ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు..” ఇదే అజెండా, ఇదే వ్యూహం, ఇదే బీజేపీ ఉద్దేశం. అందుకే కన్నా స్థానంలో సోము వీర్రాజు వచ్చారు. కర్రసాము, కత్తిసాముకి సిద్ధమవుతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చేసారు. ఏనాటి నుండో ఆశించిన స్థానం… ఇప్పుడు దక్కింది. పాపం కన్నాకు కన్నం పెట్టి మరీ సోముకి అందలం ఎక్కించారు. దీని వెనుక కారణాలు అనేకం ఉన్నాయని అనుకున్నా…, వైసీపీతో బంధం, కన్నా ఒంటెద్దు పోకడలు, పవన్ వర్గం లాబీయింగ్ బాగానే పని చేసిందని చెప్పుకోవచ్చు. కన్నాకు ఇది ఊహించాయి పరిణామం. కానీ ఈ విషయాన్నీ “న్యూస్ ఆర్బిట్” ఆరు రోజులు ముందే వెల్లడించింది. కన్నాకు ఎందుకు ఎసరు పడుతుందో కూడా చెప్పింది.
మరి ఇప్పుడు “ఒక తిరుగులేని జాతీయ పార్టీకి.., కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన సోము వీర్రాజు ఏం చేస్తారు…? పార్టీ బలోపేతానికి ఏం చేయనున్నారు…? వైసీపితో బంధాన్ని ఎలా కొనసాగించనున్నారు…? పవన్ కి ఎలా మద్దతు ఇవ్వనున్నారు…? పార్టీలో భిన్న వర్గాలను ఎలా కలుపుకుపోనున్నారు..? అనేది కీలకమే. అందుకే సోముకి ఇప్పుడు కర్ర సామూ, కత్తిసాము చూపాల్సిందే…!
వైసీపీతో బంధమే కీలకం…!!
ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన అంశం “కన్నాకు సీటుకి కన్నం ఎక్కడ పడింది..? అనేది. దీనికి ప్రధాన కారణం వైసీపీతో ఆయన వ్యవహారం సరిగా లేకపోవడమే. ఒంటెద్దు పోకడలుతో విమర్శలు చేయడం.., జగన్ నిర్ణయాలను తరచూ విమర్శించడం.., మూడు రాజధానులపైనా.., నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ సరిగా వ్యవహరించకపోవడం… ఇలా చాలా కారణాలున్నాయి. మొత్తానికి వైసీపీతో బంధం నడపకపోవడం కన్నాకు సున్నం పెట్టింది. ఇది మొదటి కారణం మాత్రమే. ఇక కన్నా లాబీయింగ్ సరిగా లేకపోవడం, జనసేన అధినేత పవన్ కూడా మద్దతు ఇవ్వకపోవడం… ఇలా అనేక కారణాలతో కన్నా పోస్టు ఊడింది. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది వైసీపీతో బీజేపీ బంధం కీలకం, కీలకం, కీలకం..!
జగన్ కి మిత్రులు కాదు.., అలా అని శత్రువులూ కాదు…!!
బీజేపీ ఇప్పడు వైసీపీకి మిత్ర పక్షం కాదు, అలా అని శత్రువు కూడా కాదు. ప్రజల్లో ఉండాలి, ఉనికి కాపాడుకోవాలి అంటే ప్రజా సమస్యలపై గళం విప్పాలి… అలా చేస్తే అధికార పక్షానికి కోపం వస్తుంది. దూరమవ్వాల్సి వస్తుంది. కన్నా అలా వెళ్లి దెబ్బతిన్నారు. ఏకంగా ఆయన విజయసాయిరెడ్డితో ఒట్టు.., కోర్టు కేసులు అంటూ దూకుడుగా వెళ్లారు. చివరికి పదవికి దూరమయ్యారు. మొత్తానికి వైసీపీతో బంధం విషయంలో సోము వీర్రాజు ఆచితూచి వ్యవహరించాలి. గత ప్రభుత్వ హయాంలో ఆయన టీడీపీని విమర్శించావారు. పార్టీ పొత్తుతో ఉన్నా, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా,,, ఆగేవారు కాదు. బద్ధమైన బీజేపీ వాదిలా బలంగా చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. బహుశా ఆయన టీడీపీ వ్యతిరేకి, జగన్ అనుకూలం అనుకున్నారేమో… కాదు ఆయన బద్ధ బీజేపీ వాది, సంఘ్ పరివార్ సభ్యుడు అదే ఇప్పుడు కలిసి వచ్చింది.