టీడీపీకి సంబంధించి కొన్ని కొన్ని విషయాలను ఇప్పుడే సరిచేసుకుంటే.. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ గెలు పు తథ్యమని అంటున్నారు పరిశీలకులు.. రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఒకటి. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉన్నా.. గోపాలపురంలో ఆయన తీసుకున్న నిర్ణయం సరైందనే టాక్ జనాల నుంచే వినిపిస్తోంది. ఇది పక్కా వాస్తవం. తాజాగా నిర్వహించిన రెండు సర్వేలలో చంద్రబాబు ఈక్వేషన్కు జనాలు జై కొట్టారు.
గోపాలపురంలో యువకుడు, ఉత్సాహవంతుడు, ఉన్నత విద్యావంతుడు మద్దిపాటి వెంకటరాజుకు చంద్ర బాబు టికెట్ ప్రకటించారు. ఈయన ఇప్పటికే ప్రజలకు చేరువయ్యారు. గత రెండేళ్లుగా ఆయన ప్రజలతో నే ఉన్నారు. కరోనా సమయంలోనూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. గత మూడున్నరేళ్లలో పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవలు చేశారు. ఇక, సాధారణ ప్రజానీకానికి ఏ అవసరం వచ్చి నా.. నేనున్నానంటూ ఆయన ముందుకు వచ్చారు. దీంతో అతి తక్కువ సమయంలోనే ఆయన ప్రజలకు కనెక్ట్ అయ్యారు.
అందుకే.. అన్ని వర్గాల నుంచి సర్వేల రూపంలో సమాచారం సేకరించిన చంద్రబాబు మద్దిపాటికి టికెట్ ఇచ్చారు. అయితే.. కొన్ని సొంత వర్గాలే ఇప్పుడు మద్దిపాటికి కంట్లో నలుసుగామారాయి. ఆయన అభ్యర్థి త్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా మేం నీ వెంట ఉన్నాం.. మేం నీకోసం గోపాలపురం నియోజకవర్గంలో ప్రచారానికి వస్తాం.. నీ పని నువ్వు చేసుకువెళ్లమని చెప్పేశారు. మామూలుగానే గోపాలపురం పార్టీకి కంచుకోట.. కొద్ది పాటి కసరత్తుతో ఈ సీటును భారీ మెజార్టీతో గెలుచుకునే అవకాశం ఉంది.
చంద్రబాబు ఇక్కడ ఉన్న అసమ్మతి వాదులను పిలిచి సమస్య పరిష్కరిస్తే గోపాలపురం మెజార్టీ రాజమండ్రి ఎంపీ సీటు గెలుపులో కీలకం కానుందనేది వాస్తవం. ఈ విషయంలో చంద్రబాబు నెగ్లట్ చేయకుండా ఇప్పుడే ఇక్కడ అసమ్మతి నేతలను పిలిచి మాట్లాడితే ఎన్నికలకు నెలన్నర ముందే .. ఒక సీటును టీడీపీ బంపర్ మెజార్టీతో తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుందనేది రాజకీయ వర్గాల టాక్ ?