బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే నటిస్తుంది. ఇపటికే ఈ సినిమా నుంచి రిలీజైన రొమాంటిక్ పోస్టర్స్, లిరికల్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన అఖిల్ హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు. ఇక నాలుగో సినిమాగా వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నాడు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను కి గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు సినిమా చిత్రీకరణ పూర్తైనట్టు సమాచారం. ఇక అఖిల్ భారీ సక్సస్ రావాలన్న ఉద్దేశ్యంతో నాగార్జున ఈ సినిమా గురించి ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ పూర్తయిన సినిమా మొత్తం నాగార్జున చూసారని.. అవుట్ ఫుట్ మీద నాగ్ చాల హ్యాపీగా.. నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది.
ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సక్సస్ అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా చాలా కీలకం. కాగా అఖిల్ 5 రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని 5 వ సినిమా రూపొందనుంది. ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తాడని సమాచారం. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశలున్నాయని చెప్పుకుంటున్నారు. కాగా ఇంకా ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!