45 – 50 రోజుల్లో సినిమా కంప్లీట్ చేయడం అంటే అందరి దర్శకుల వల్ల అయ్యే పని కాదు. అలా సాధ్యమయ్యేది కేవలం ఇద్దరు దర్శకుల వల్లే. ఆ ఇద్దరే పూరి జగన్నాధ్ – క్రిష్. ఈ ఇద్దరు పక్కా ప్లానింగ్ తో సినిమాకి అనుకున్న బడ్జెట్ లో అనుకున్న రోజుల్లో.. ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ రోజుల్లో కూడా సినిమాని పూర్తి చేసిన రోజులున్నాయి. ప్రస్తుతం క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష.. ఓమ్ శివమ్ అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
అయితే 15 రోజుల చిన్న షెడ్యూల్ కంప్లీటయ్యాక కరోనా కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ప్రారంభించాలనుకుంటే అనూహ్యంగా పవర్ స్టార్ ఒక సినిమా కమిటవడం వల్ల.. క్రిష్ సినిమా డిలే అవుతోంది. ఇప్పటికే వచ్చిన ఈ గ్యాప్ లో క్రిష్ ఒక సినిమా కంప్లీట్ చేసుకొని వచ్చాడు. వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో క్రిష్ 45 రోజుల్లోనే టాకీపార్ట్ ని ఫినిష్ చేశాడు. కరోనా సమయంలో కూడా క్రిష్ పక్కా ప్లానింగ్ తో అన్ని జాగ్రత్తలు తీసుకొని మెగా మేనల్లుడు తో సినిమా పూర్తి చేసి వచ్చినందుకు అందరూ షాకయ్యారు.
అయితే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ సినిమా పట్టాలెక్కిస్తాడనుకుంటే మళ్ళీ మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. క్రిష్ సినిమా పీరియాడికల్ మూవీ కావడంతో ఎక్కువ మంది యూనిట్ సభ్యులు .. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనాల్సి ఉన్న కారణంగా కరోనా ని దృష్ఠిలో పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. అందుకే మళ్ళీ గ్యాప్ వస్తున్నందున క్రిష్ తన హోమ్ బ్యానర్ లో ఒక సినిమాని చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని నిజంగా కాస్త గ్యాప్ వస్తే మాత్రం క్రిష్ సినిమా కంప్లీట్ చేయడం మాత్రం పక్కా.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!