టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ ఎంత అసాధారణమైనదో అందరికీ తెలిసిందే. అయినా చాలా సింపుల్ గా కనిపిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని ఇండస్ట్రీలో అందరూ మెగాస్టార్ ని చూసి తెలుసుకోవాల్సిందే. చిరంజీవి దర్శకులని, నిర్మాతలని ఎంతగా గౌరవిస్తారో ఇండస్ట్రీలో ఆయనతో పనిచేసిన ప్రతీఒక్కరు చెబుతారు. అంతేకాదు సక్సస్ ఫుల్ డైరెక్టర్ ని ఫ్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్ ని ఒకేలా చూడటం గౌరవించడం మెగాస్టార్ లో ఉన్న గొప్పతనం. అందుకే ఇప్పుడు అందరూ వద్దని వారిస్తున్న ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశమిచ్చారు.
కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటించబోతుండగా వి.వి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన ఈ నెలలోనే రానుందని సమాచారం. అలాగే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక భారీ సక్సస్ లేని డైరెక్టర్ మెహర్ రమేష్ తో తమిళ సూపర్ హిట్ వేదాళం రీమేక్ లో నటించబోతున్నారు. అయితే తండ్రి మాదిరిగానే తనయుడు రాం చరణ్ కూడా ఒక ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం.
‘అశోక్’ ‘అతిథి’ ‘ఊసరవెల్లి’ ‘రేసుగుర్రం’ ‘కిక్’ ‘టెంపర్’ ‘ఎవడు’ సినిమాలకు కథ అందించిన రచయిత వక్కంతం వంశీ.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయినా మేకింగ్ పరంగా మాత్రం వక్కంతం వంశీకి మంచి పేరు దక్క్కింది. ఇప్పుడు దర్శకుడు చెప్పిన కథ కే చరణ్ ఒకే చెప్పినట్టు సమాచారం. నిజంగా ఫ్లాప్ ని చూడకుండా టాలెంట్ ని బట్టి ఛాన్స్ ఇస్తే మాత్రం మెగాస్టార్ తర్వాత చరణ్ గ్రేట్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. అయితే ఇంకా ఇందుకు సంబధించిన అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!