మన టాలీవుడ్ లో ఆల్ రౌనడర్ అండ్ టాలెంటెడ్ హీరోగా అడవి శేష్ కి మంచి పేరుంది. అంతేకాదు తనకి 24 క్రాఫ్ట్స్ మీద గట్టి పట్టుంది. అందరు హీరోల మాదిరిగా కమర్షియల్ పంథాలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. యంగ్ హీరో అంటే కమర్షియల్ సినిమాలు చేసి మాస్ హీరో అనిపించుకోవాలి, లవర్ బాయ్ గా కనిపించాలి అని ఎప్పుడు ఆలోచించలేదు.
వాస్తవంగా చెప్పాలంటే మంచి స్పై అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలను తీస్తూ హాలీవుడ్ లెవెల్ సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాడు అడవి శేష్. కేవలం నటునిగానే కాకుండా గొప్ప రచయితగాను కూడా శేష్ ఆకట్టుకున్నాడు. కాగా ఇపుడు అడవి శేష్ ముంబై టెర్రర్ దాడులలో వీర మరణం పొందిన ఉన్ని కృష్ణన్ గారి జీవిత చరిత్రపై తెరకెక్కిస్తున్న “మేజర్” చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. బయోపిక్ కావడం, సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ్మలో ఈ సినిమా రూపొందుతుండటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో శేష్ ఒక అఫీషియల్ అప్డేట్ ను ఇచ్చాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్టుగా కన్ఫామ్ చేసాడు. అక్టోబర్ నుంచి సాయి మంజ్రేకర్ షూట్ లో పాల్గొననుంది అని తెలిపారు. ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సోనీ పిక్చర్స్ వారు తెలుగులో మొదటి సినిమాగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అలాగే సాయీ మంజ్రేకర్ ని మహేష్ సినిమా సర్కారు వారి పాట లో కూడా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాలో ఇప్పటికే కీర్తి సురేష్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ లీడ్ కి నమ్రత.. సాయీ మంజ్రేకర్ ని తీసుకోమని సూచించిందట. అందుకు కారణం సాయీ మంజ్రేకర్ నమ్రత కి అత్యంత సన్నిహితురాలు కావడమే అని తెలుస్తుంది. అంతేకాదు వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సర్ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కన్ఫార్మ్ అయిందని ఇంతకముందే వార్తలు వచ్చాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!