సినిమా సెలబ్రిటీస్ కొన్ని సార్లు తమకి సంబంధం లేకపోయినా అనవసరంగా కొన్ని వ్యవహారలలో ఇరుక్కొని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఎక్కువమంది తో పరిచయాలు కూడా ఇందుకు ప్రధాన కారణం అవుతాయి. ఇప్పుడు టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటుంది. చాలాకాలానికి టాలీవుడ్ లో మంచి అవకాశం వచ్చింది. హ్యాపీగా ఆ సినిమా చేసుకుందామని హైదరాబాద్ వచ్చి చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇంతలో పిడుగు లాంటి వార్త. అందులో రకుల్ పేరు.
బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కి సమన్లు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాని రకుల్ టీమ్ మాత్రం తమకు సమన్లు అందలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్సిబికి, రకుల్ మధ్య ఏం జరుగుతోందనని మీడియా వాళ్ళు, జనాలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ముడిపడిన బాలీవుడ్ డ్రగ్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యింది. విచారణలో భాగంగా డ్రగ్స్ తీసుకున్న 25 మంది సెలబ్రిటీస్ ప్రేర్లు ఆమె వెల్లడించినట్టు.. అందులో రకుల్ పేరు కూడా ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం వార్త వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మీడియాలో తన పేరు మీద కథనాలు రాకుండా చూడమని రకుల్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయింది రకుల్. మొదట బాలీవుడ్ సెలబ్రిటీల లిస్టు ప్రిపేర్ చెయ్యలేదని చెప్పిన ఎన్సిబి…. ఆ తరవాత దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ తదితరులకు సమన్లు జారీ చేసినట్టు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో రకుల్, బుధవారం ముంబై చేరుకుంది. ఎన్సిబి వర్గాల ప్రకారం ఈ రోజు రకుల్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.
కాగా రకుల్కి సమన్లు అందలేదని ఆమె లాయర్లు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. హైదరాబాద్ లేదా ముంబైలో ఎక్కడా రకుల్కి సమన్లు అందలేదని అందులో పేర్కొన్నారు. శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ని డైరెక్టుగా కలిసి సమన్లు అందజేసిన ఎన్సిబి టీమ్, రకుల్కి మాత్రం డిజిటల్ పద్దతిలో సమన్లు అందజేశామని అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో తెలియదు గాని రకుల్ మాత్రం చాలా డిస్టర్బ్ అవుతోదట.