ప్రమాదాలు జరకుండా ఇప్పటికే పోలీస్ వ్యవస్థ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. రోడ్డు భద్రత చర్యలను పాటించకుండా ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలే ముఖ్యం.. అందులో కొందరు చేసే తప్పులకు మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని తెలుపుతోంది.
అందుకే ఏ ఒక్కరూ కూడా నిబంధనలకు అతీతంగా వ్యవహరించొద్దని తెలుపుతున్నారు. అందుకే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఇప్పటికే వాహనాలు నడిపే వారికి లైసెన్స్ తప్పని సరి చేస్తూ.. నిబంధనలు జారీ చేశారు.
కారు మొదలగు వెహికల్స్ నడిపే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక బైక్ నడిపే వారి విషయంలో మారీ కఠిన నియమాలను తీసుకొచ్చారు. ఇద్దరు మాత్రమే బైక్ మీద వెళ్లాలని సూచిస్తున్నారు. అలా నియమాలను పాటించని వారికి చెలాన్లతో మతి పోయేలా చేస్తున్నారు.
ఒకవేళ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే.. లైసెన్స్ ను కూడా క్యాన్సల్ చేస్తామని తెలిపారు. ఇక ముఖ్యంగా బైక్ పై వెళ్ళేవారికి హెల్మెట్ ఉండాలన్న నిబంధనను తప్పక పాటించాలని సూచించారు. ఈ నిబంధనలను హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పక్కాగా ఆములు చేసే పనిలో పోలీసులు ఇప్పుడు ఉన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో 90శాతం మంది బైక్ నడిపే వారు హెల్మెట్ వాడుతున్నారు. అయితే ఈ హెల్మెట్ కూడా తల, ముఖం పూర్తిగా కవరయ్యే విధంగా ఉండాలని నిబంధన పెట్టారు. అవి కూడా ఐఎస్ ఐ మార్కు ఉన్న బ్రాండెడ్ వాటినే వాడాలని చెప్తున్నారు. అలా చేయకపోతే భారీ జరిమానాలు ఉంటాయని సూచిస్తున్నారు. మీకు కూడా ద్విచక్ర వాహనం ఉంటే నిబంధనలకు అనుగుణంగా ఉండే హెల్మెట్ ను కొనుగోలు చేసి చెలాన్ నుంచి తప్పించుకోండి.