ఈ సృష్టిలో తల్లిని మించిన వ్యక్తి కానీ, దైవం కానీ లేదు. ఎందుకంటే.. ఆ వ్యక్తులను, ఆ దైవాలను నువ్వు చూసేలా చేసింది నీ కన్న తల్లే కాబట్టి. కటిక పేదరికంలో ఉన్నా కూడా తన కొడుకు, కూతురి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేది కేవలం తల్లే అనడంలో సందేహం లేదు.
అందుకే తల్లి ప్రస్తావన లేని గ్రంథాలు లేవు. తల్లిని తక్కువ చేసిన మాట్లాడిన ఏ ఒక్కని ఈ సొసైటీ అంగీకరించదు. కానీ ఇంత జరుగుతున్నా.. అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు బాధ అవ్వక మానదు. కారణం సొంత తల్లిని విడిపించుకునేందుకు తన్న కుమారులు చేసే ప్రయత్నాలు అలాంటివి మరీ..
నిన్ను కన్న తల్లి తన వృధ్యాప్యంలో కోరుకునేది కేవలం.. బుక్కెడు బువ్వ, నాలుగు మాటలు మాట్లాడే మనుషులను. అది కూడా చేతకాని కొడుకులను ఏమనాలో తెలియడం లేదు. ఇక విషయంలోకి వెళితే.. సొంత కన్న తల్లిని ఒక ప్రబుద్ధుడు మనుషులు తిరగని అడవి ప్రాంతంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ తల్లి అతనికి ఎంత భారం అయిందో తెలియదు కానీ..
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన లింగమ్మ (63)ను ఆమె కొడుకు, కోడలు గురువారం ఆటోలో తీసుకొచ్చి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో ఎవరూ లేని చోట దించేశారు. తిరిగి వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ తల్లి తన కొడుకు వస్తాడని, తీసుకెళతాడని ఆశగా ఎదురుచూసింది.
ఆ తల్లికి ఎటు పోవాలో తెలియక, ఆహారం, నీళ్లు లేక నీరసించి.. స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో విధుల మీద అటుగా పోతున్న ఒక కానిస్టేబుల్ ఆ తల్లి దీన స్థితిని చూసి చలించి పోయాడు. వెంటనే 108 కు కాల్ చేసి హాస్పిటల్ కి తరలించారు. తర్వాత విషయాలన్నీ తెలుసుకుని ఆ కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.