గుడి మెట్లపైన, ఫూట్ పాత్ రోడ్డు ప్రక్కల యాచించే వారిని చూస్తే మనుషులు ఇలా కూడా బతుకుతారా.. అనే సందేహం కలుగుతుంది. ఒంటికి నిండా కప్పుకోవడానికి కూడా బట్టలుండని బతుకులు వారివి.. బక్క పల్చని శరీరంతో ఎవరైనా దానం చేయకపోతారా… మా కడుపులు నిండక పోతాయా అని నిరీక్షించి చతికిల బడే జీవం వారిది. ఇలాంటి బతుకులు ఎప్పుడు కనుమరుగవుతాయో.. వీరు ఎప్పుడు మూడు పూటల తింటారో నని చాలా మంది బాధపడుతుంటారు.
వారికి చేతనైన సాయం చేస్తుంటారు. వారి చూసి చాలా మంది జాలి పడి ఏదో విధంగా వారికి సాయం చేస్తుంటారు కొందరు మహానుబావులు. కాని ఓ యాచకురాలిని పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. అడుక్కుతినే వారికి జైలులో వేయడం ఏంటని తిట్టుకుంటున్నారా.. అయితే ఆమె గురించి మీరు తప్పకుండా తెల్సుకోవాల్సిందే.. ఆమెను చూస్తే అయ్యో ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందేటని అందరూ ఆమెకు చేతనైన సాయం చేసేవారు.
పక్షవాతంతో వీల్ చైర్ లో ఉండే ఆమె బిక్షటన చేస్తూ ఉండేది. కాని కాలం ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టేసింది. దొంగ వేశంలో ఆమె ఆడుతున్న నాటకానికి తెరదింపారు పోలీసులు. ఆమె అసలు రంగును బయటపెట్టారు. ఆమె బిచ్చగత్తె కానే కాదు మిలియనీర్ అని తేల్చి చెప్పేసింది. అంతేకాదండోయ్.. ఆమెకు 5 ఇండ్లు, బ్యాంక్ అకౌంట్ లో 3 మిలియన్ ఈజిప్టియన్ పౌండ్లు ఉన్నాయని పోలీసులు తేల్చారు. దీంతో ఆమెను జైల్లో వేశారు.
వివరాల్లోకి వెళితే.. నఫిసా యాచకురాలు వీల్ చైర్ లో ఉండి భిక్షాటన చేసి అది పూర్తైన వెంటనే నడిచి వెళ్లేదంటూ దాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దాంతో పోలీసులు విచారించి ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపింది. కాగా దొంగ వేశంతో ఇలా యాచిస్తుందని తెలిపారు. ఆమెకు గర్బేరియా, కాలియుబియాలో 5 ఇండ్లు కూడా ఉన్నట్టు తెలిపారు. ఆమెపై విచారణ కొనసాగుతుందని అక్కడి పోలీసులు వెళ్లడించారు.