వరుసగా మూడో సారి కూడా విజయం దక్కించుకుంటాను- నాయకులు తరచుగా చెప్పే మాట ఇది. పార్టీ ఏదైనా.. నాయకులు ఎవరైనా వరుస విజయాలు దక్కించుకున్నాక.. సహజంగా వారి నోటి నుంచి తన్ను కుని వచ్చే మాట ఇదే. అయితే.. మూడో సారి విజయం అంత తేలిక అయితే కాదు. చరిత్ర చెబుతున్న వాస్తవం కూడా. రెండు సార్లు విజయం అందుకున్న నాయకులు కూడా గత ఎన్నికల్లో డింకీలు కొట్టారు. మంచి పేరున్న నేతలు కూడా.. పరాజయంపాలయ్యారు. ఇప్పుడు ఇదే ఫార్ములా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు కూడా వర్తిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు అందుకున్న ఫైర్బ్రాండ్ ఆర్కే రోజా.. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అయితే.. ఆమె తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ మరో సారి విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టి రికార్డు సొంతం చేసుకోవాలని తపన పడుతున్నారు. అయితే.. ఈ విజయం అంత ఈసీకాదనేది ఎప్పటికప్పుడుతెరమీదికి వస్తున్నవాస్తవం. రోజాకు ఒక అలవాటు ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇద్దరు జ్యోతిష్కుల దగ్గరకు ఆమె వెళ్తారు.
తన జాతకం ఎలా ఉందో చూపించుకుంటారు. వారు చెప్పినట్టుపూజలు యాగాలు కూడా చేస్తారు. వరుసగా ఏడు వారాలు శ్రీవారిని ఆమె దర్శించుకున్న విషయం తెలిసే ఉంటుంది. ఇది వారు చెప్పిన విరుగుడు మంత్రమేనట. ఆ తర్వాతే ఆమెకు.. మంత్రి పదవి దక్కిందని అంటారు. ఇక, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. అసలు టికెట్ ఇస్తారో లేదో అనే సందేహం. ఎందుకంటే.. ఆమెకు వ్యతిరేకంగా గళాలు మరిన్ని పెరిగాయి. తాజాగా రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ.. సుమారు 200 మందికిపైగా నాయకులు.. మండలాల స్థాయిలో తీర్మానం చేసేశారు.
అంతేకాదు.. రోజా సహా ఆమె భర్తపైనా నిప్పులు చెరిగారు. రోజాకు టికెట్ ఇస్తే.. తాము కచ్చితంగా ఆమెను ఓడిస్తామనితేల్చి చెప్పారు. ఇదిలావుంటే, తాను మూడోసారి కూడా విజయం దక్కించుకుని తీరుతానని రోజా చెబుతున్నారు అయితే, క్షేత్రస్థాయిలో ఇటీవల ఒక ఆన్లైన్ చానెల్ నిర్వహించిన సర్వేలో రోజాకు వ్యతిరేకంగానే ప్రజలు గళం వినిపించారు. కేవలం ఆమె మీడియా ముందు మాట్లాడేందుకు మాత్రమే మంత్రి అయ్యారని మెజారిటీ మహిళలే వ్యాఖ్యానించారు. దీంతో రోజా పరిస్థితి డోలాయ మానంలో పడింది. ఈ క్రమంలోనే రోజా తన జాతకాన్ని మరోసారి చూపించుకోవాలని సటైర్లు వేస్తున్నారు విపక్ష నేతలు.