Intinti Gruhalakshmi : అంకిత చేసిన చపాతీలు బాగోలేదన్న వాళ్ళ నానమ్మ మాటలకు.. అంకిత కూడా సహనం కోల్పోయి మాట్లాడుతుంది. ఈ అవకాశాన్ని లాస్య ఉపయోగించుకొని ఇంట్లో గొడవ జరగడానికి గాయత్రి పిలిపిస్తుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న గాయత్రి దీంతో ఇంట్లో వాళ్లందరినీ ఓ రేంజ్ లో దుమ్ముదులిపేసింది..! ఈ మంటలు ఆరి పోకుండా లాస్య ఏ విధంగా ఆజ్యం పోస్తుందో.. నేటి 549వ ఎపిసోడ్ హైలెట్స్ వీక్షిద్దాం..!
ఇంట్లో గాయత్రి మాట్లాడిన మాటలకు నందు నొచ్చుకుంటాడు. పైగా లాస్య గాయత్రీ మాటలకు వంతు పలకడంతో ఇంకా కోపం వచ్చిన నందు లాస్య పై ఫైర్ అవుతాడు. లాస్యను ఈ విషయంలో తలదూర్చవద్దని. అంకితను రెచ్చగొట్టవద్దని చెబుతాడు. మిగతా విషయాలు తులసి చూసుకుంటుందని చెబుతాడు.. తులసి అంటే నీకు బెల్లం నేనంటే అల్లం అంటూ లాస్య నందు తో వెటకారం గా మాట్లాడుతుంది. కట్ చేస్తే..
అనసూయమ్మ తులసి దగ్గరికి వచ్చి ఇంట్లో ఈ గొడవ జరగడానికి నేనే కారణం.. కాస్త నా నోరు అదుపులో పెట్టుకోవలసింది. ముందు అనేసాను ఆ తర్వాత బాధ పడతాను అని చెబుతుంది. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అత్తయ్య చపాతీలు లావుగా ఉన్నాయని టీ రుచిగా లేదని అంకితను అనకుండా ఉండాల్సింది. ఈ తరం వారికి తగ్గట్టు నడుచుకోవాలని మీ మావయ్య కూడా చెబుతున్నాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను అని సారీ చెబుతుంది తులసికి. ఇక అంకిత దగ్గరకు ప్రేమ్, శృతి వెళ్లి పొద్దున్నుంచి ఏమీ తినలేదు. పాలు తాగామని ఇస్తారు. జరిగిందేదో జరిగింది అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండమని ఎలాగోలా అంకిత కు నచ్చచెప్పి.. అంకిత తో పాలు తాగేలా చేస్తారు. అంకిత పాలు తాగిందా లేదా అని శృతి ని అడిగి తెలుసుకుంటుంది తులసి. శృతి తులసి మనసులో భయాన్ని నిజమేనని అంకిత లాస్య మాయలో పడిందని శృతి చెబుతుంది.
Read More: Devatha Serial: సత్యను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడిన మాధవ్.! కమల శ్రీమంతానికి రాధ వస్తుందా..!?
లాస్య ఇంట్లో జరిగిన గొడవలు భాగ్యం కు ఫోన్ చేసి చెబుతోంది ఇక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని లాస్య బ్రెయిన్ కి మరో మంచి ఐడియా ఇస్తుంది భాగ్య ఇక ఆ ఐడియా ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తుంది ఇక అందులో భాగంగానే అంకిత ను పొగిడి తన బుట్టలో వేసుకుని డిన్నర్ కి తీసుకువెళుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళందరూ ఎలా రీయాక్ట్ అవుతారు. అంకిత మళ్లీ తులసికి దూరమవుతుందా.. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!