టాలీవుడ్ లో క్రేజ్ ఉండి వరసగా సినిమాలు చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది మళయాళ బ్యూటి అనుపమ పరమేశ్వరన్. యంగ్ హీరోలతోనే అనుపమ సినిమాలన్ని చేసింది. మరీ డిజాస్టర్స్ అయితే ఈ బ్యూటి అకౌంట్ లో లేవుగాని చెప్పుకునేంత కమర్షియల్ సక్సస్ మాత్రం లేదు. శతమానం భవతి …ఆ మధ్య వచ్చిన బెల్లకొండ శ్రీనివాస్ రాక్షసుడు తప్ప మధ్యలో వచ్చిన నాని, రాం, సాయి తేజ్ సినిమాలన్ని యావరేజ్ సినిమాలుగానే నిలిచాయి. అయితే అనుపమ ప్రస్తుతం ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ –2‘ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందని దాంతో చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ కొట్టిన శృతి శర్మను ఎంచుకున్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది. మరి ఇది నిజం అయితే అనుపమ చేతిలో ఉన్న ఒక్క సినిమా కూడా మిస్ అయినట్టే.
మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలీదు గాని కార్తికేయ మాదిరిగా ‘కార్తికేయ –2‘ కూడా సూపర్ హిట్ అయ్యోలా హీరో దర్శకుడు కష్టపడుతున్నారట. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొత్తగా ప్రజెంట్ చేయబోయో కాన్సెప్ట్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి క్రేజ్ ని తెచ్చుకున్న చందు మొండేటి ఆ తర్వాత ఆ స్థాయి సక్సస్ ని అందుకోలేకపోయాడు. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!