అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. శేషాచలం అడవుల్లో ఎరచందం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట.
కాగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా సాయి పల్లవి నటించే అవకాశాం ఉందని అంటున్నారు. అంతేకాదు సాయి పల్లవి .. అల్లు అర్జున్ కి చెల్లి గా నటించబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా ఇప్పటికే చాలా నెలలు పెండింగ్ పడటంతో ఇక నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని సుకుమార్ బృందం ప్లాన్ చేస్తున్నారట. ఇపటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ అయి దేవీశ్రీప్రసాద్ తన మార్క్ ఆల్బం ని ఇస్తున్నాడని అంటున్నారు. ఇక గత కొంతకాలంగా రేస్ లో వెనకపడ్డ దేవీశ్రీప్రసాద్ పుష్ప సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి రాబోతున్నాడని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో దేవీ మార్క్ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని ముందునుంచి చెప్పుకొస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ సినిమాకి హైలెట్ అవుతుందని ఇప్పటికే బాగా ప్రచారం అవుతోంది. ఇక ఈ ఇటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశాపఠాని ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మెస్మైరైజ్ చేసే విధంగా పిచ్చ హాట్ అండ్ గ్లామరస్ గా కనిపించబోతుందని తెలుస్తోంది. హై ఓల్టేజ్ లో దిశా గ్లామర్ వడ్డిస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఈ సాంగ్ ఎంత హైలెట్ అవుతుందో.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!