ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో “రౌద్రం రణం రుధిరం” మొదటి స్థానంలో ఉంది. పాన్ ఇండియన్ కేటగిరిలో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా ఒకేసారి అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటికే ఈ సినిమా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సంవత్సరం సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఆగిపోయింది. 2021 సంక్రాంతికి అనుకుంటే అప్పుడు రిలీజ్ కావడం అన్నది అనుమానమే. ఈ క్రమంలోనే ఈ సినిమాకి మరో రకంగా ఇబ్బందులు ఎదురవనున్నాయా ..అంటే అవుననే అన్న మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది.
ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాల్లో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. సుశాంత్ సింగ్ ఆత్మ హత్య ఘటన జరిగినప్పటి నుంచి బాలీవుడ్ లో రక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది స్టార్ నటులు సహా నిర్మాతల సినిమాల మీద ఈ సంఘటన బాగానే ప్రభావం చూపించింది. అందుకు ఉదాహరణగా రీసెంట్ గా విడుదల అయిన్న “సడక్ 2” ట్రైలర్. ఈ ట్రైలర్ రిలీజ్ చేశాక సినిమాకు ఇలా దారుణంగా నెగిటివిటి రావడానికి కారణం మహేష్ భట్, ఆలియా భట్ అని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పుడు ఆలియా భట్ “రౌద్రం రణం రుధిరం” లో రాం చరణ్ కి జంటగా నటిస్తుంది. దాంతో “రౌద్రం రణం రుధిరం” కి ఆలియా భట్ వల్ల ఏదైనా ప్రభావం చూపించే అవకాశాలున్నాయా అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయట. బాహుబలి తర్వాత బాలీవుడ్ లో రాజమౌళి కి మంచి క్రేజ్ వచ్చింది. ఆయన సినిమాలకి అక్కడ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ళు వస్తున్నాయి. మరి ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి ఏం చేయబోతున్నారో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!