ఏపీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ పదవి నుండి కన్నా లక్ష్మీనారాయణను తొలగించడం అతని రాజకీయ జీవితానికే పెద్ద దెబ్బ చెప్పాలి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ నాయకుడికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. 2014 ఎన్నికల తర్వాత కన్నా అనుకోని పరిస్థితుల్లో మరియు విపరీతమైన హంగామాతో అక్టోబర్లో బిజెపిలో చేరారు. అప్పుడు వైసీపీకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్న కన్నా కు బిజెపి హు కమాండ్ రాష్ట్ర ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. అయితే కన్నా తన పదవికి న్యాయం చేకూర్చలేదని ఇప్పుడు అతని స్థానంలో సోము వీర్రాజు ను తెచ్చిపెట్టింది.
హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం లక్ష్మీనారాయణను చాలా తీవ్రంగా మనస్తాపానికి గురి చేసిందన్న విషయంలో ఏ మాత్రం అనుమానం లేదు కానీ ఇప్పుడు కన్నా పయనం ఎటు వైపు అన్న విషయం పైనే అందరి ఆసక్తి నెలకొంది. బిజెపిలో ఉన్నన్నాళ్ళు వైసీపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కన్నా…. విజయసాయిరెడ్డితో అయితే డైరెక్ట్ యుద్ధానికి దిగారు ఇక. దీనితో వైసీపీలో చేరే దారిలు అతనికి మూసుకుని పోయినట్లే. జనసేన బీజేపీతో పొత్తు లో ఉంది కాబట్టి జనసేన లోకి కూడా వెళ్లే అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు కన్నా ముందున్న ఏకైక ఆప్షన్ అతనికి ఎంతో ప్రీతిపాత్రంగా చెప్పబడే టిడిపి మాత్రమే.
అయితే కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడిప్పుడే టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపరు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. నాలుగేళ్లపాటు టిడిపి ప్రతిపక్షంలోనే ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మారాల్సిన అవసరం కూడా లేదు. అదీ కాకుండా వెంటనే టీడీపీలో చేరితే విజయసాయిరెడ్డి ఇన్నాళ్ళు అతను 20 కోట్లు పైగా డబ్బు తీసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్ని చేసిన ఆరోపణలు అన్నీ నిజం చేసిన వారవుతారు కాబట్టి కన్నా కచ్చితంగా టీడీపీలోకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు కానీ అతను 2023 లేదా 2024 లో పసుపు పార్టీ తీర్థం పుచ్చుకోవడమే మంచిదని భావిస్తున్నారట. మరి లక్ష్మీనారాయణ అన్నాళ్ళు తన మనసు చంపుకొని భాజపాలో నామమాత్రంగా అయినా కొనసాగగలరా అన్నది ఇక్కడి ప్రశ్న.