Ysrcp : ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక రాజకీయ నేతగా ఎప్పటినుండో రాణిస్తున్న వారిలో బొత్స సత్యనారాయణ ఒకరు.
కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా రాణించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం అందరికీ తెలిసిందే. కాగా గత సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స సత్యనారాయణ ప్రస్తుతం మంత్రిగా పార్టీలో రాణిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు తన పొలిటికల్ వారసుడు కొడుకు సందీప్ నీ పొలిటికల్ రంగంలో దింపడానికి ఆయన తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు ఉత్తరాంధ్ర రాజకీయాల టాక్ గట్టిగా వస్తోంది. ప్రస్తుతం డాక్టర్ గా రాణిస్తున్న సందీప్ ని ఎలాగైనా జగన్ దృష్టిలో పడేటట్లు బొత్స సత్యనారాయణ అనేక ఫీట్లు వేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినబడుతోంది.
అందుకోసమే జగన్ పుట్టినరోజు నాడు భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఈ కార్యక్రమాన్ని తన కొడుకు ఆధ్వర్యంలో నిర్వహించి, అదే రోజు జగన్ కి తన కొడుకుని బొత్స పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో బొత్స సత్యనారాయణ తన పుట్టిన రోజు వేడుకల సమయంలో నియోజకవర్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన క్రమంలో తన కొడుకు ఫ్లెక్సీలు ఎక్కువ ఉండేలా చూసుకున్నట్లు దీంతో కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం బొత్స భారీగానే వ్యూహాలు వేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. విశాఖపట్టణానికి రాజధాని వచ్చేలోపు కొడుకు పొలిటికల్ ఎంట్రీ జరిగే రీతిలో బొత్స గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం.